ఇబ్రహీంపట్నంలో(Ibrahimpatnam) దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని తల్లి ఘాతుకానికి తెగబడింది. కన్నకూతురునే చంపేసింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న భార్గవి(Bhargavi), శశి(Shashi) అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలిసింది.

ఇబ్రహీంపట్నంలో(Ibrahimpatnam) దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని తల్లి ఘాతుకానికి తెగబడింది. కన్నకూతురునే చంపేసింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న భార్గవి(Bhargavi), శశి(Shashi) అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలిసింది. శశితో మాట్లాడ కూడదని, అసలు కలవడం మానేయాలని భార్గవిని తల్లి జంగమ్మ హెచ్చరించింది. అయినా ప్రేమికులిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఓ రోజు భార్గవి ఇంట్లో ఉన్నప్పుడు శశి ఆమె ఇంటికి వచ్చాడు. ఈ విషయం జంగమ్మకు తెలిసింది. దాంతో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాను శశిని తప్ప మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనని భార్గవిచెప్పడంతో జంగమ్మ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సోమవారం భార్గవి తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది. భార్గవిని ఎవరో చీరతో ఉరి వేసి చంపేసినట్టు ఆమె సోదరుడు గుర్తించాడు. తన తల్లే భార్గవిని చంపినట్టు అతడికి అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు జంగమ్మను అదుపులోకి ఈసుకుని విచారిస్తున్నారు.

Updated On 19 March 2024 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story