ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్‌లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం

ప్రధాని మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ప్రధాని మోదీ ఎన్టీపీసీ రామగుండం రెండో యూనిట్, అంబారి-ఆదిలాబాద్ పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మంగళవారం ప్రధాని సంగారెడ్డిలో పర్యటించనున్నారు.

4వ తేదీ ప్రధాని మోదీ షెడ్యూల్..

ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్‌లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. 11.15 గంటల నుండి 12 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తమిళనాడు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. సోమవారం రాత్రి రాజ్ భవన్ లో బస చేయనున్నారు.

5వ తేదీ షెడ్యూల్:

సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి ప్రధాని మోదీ బయలుదేరుతారు. 10. 45 నుండి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 11.30 నుండి 12.15 వరకు బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఒడీశాకు వెళ్లనున్నారు.

Updated On 3 March 2024 9:55 PM GMT
Yagnik

Yagnik

Next Story