భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో చిన్న మార్పు చోటు చేసుకుంది. మోదీ పర్యటన షెడ్యూల్‌లో చివరి నిమిషంలో స్వల్ప మార్పు జరిగిందని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ ఉదయం 11:30 గంటలకు నాగ్‌పూర్‌లో హెలిప్యాడ్‌ వద్దకు రానున్నారు. అంతకుముందు షెడ్యూల్‌(10:20 గంటలకు) కన్నా ఒక గంట ఆలస్యంగా పర్యటన ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను అధికారులు తెలియజేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటనలో భాగంగా.. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. తెలంగాణలో మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.

Updated On 4 March 2024 12:09 AM GMT
Yagnik

Yagnik

Next Story