జగిత్యాలలో సోమవారం జరగనున్న విజయ్ సంకల్ప్ సభను విజయవంతం చేసేందుకు

జగిత్యాలలో సోమవారం జరగనున్న విజయ్ సంకల్ప్ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు గీతా విద్యాలయం మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు పాల్గొననున్నారు. లోక్ సభ సభ్యుడు అరవింద్ ధర్మపురి, ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కె. దినేష్ కుమార్ ఆదివారం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని మోదీ సభకు ప్రజలను సమీకరించేందుకు పార్టీ నాయకత్వం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించింది.

ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి జగిత్యాలకు ప్రధానమంత్రి మోదీ బయలుదేరనున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న హెలిపాడ్ వద్దకు ప్రధాని చేరుకోన్నారు. హేలిపాడ్ వద్ద 20 మంది నాయకులకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. ఉదయం 10:45ని లకు జిల్లా కేంద్రంలోని గీత విద్యాలయం ఆవరణలో జరగనున్న విజయసాంకల్ప సభ ప్రాంగణానికి రోడ్డు మార్గాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జగిత్యాల పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ధర్మపురి నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు.

Updated On 17 March 2024 10:04 PM GMT
Yagnik

Yagnik

Next Story