ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఈ నెల 8న వరంగల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారైంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 8వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరుతారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఈ నెల 8న వరంగల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారైంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 8వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరుతారు. 10:35గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. అక్క‌డ‌ భద్రకాళి ఆలయాన్ని సందర్శిస్తారు. 11:30 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12:10 నిమిషాల వరకు మోదీ ప్రసంగం ఉంటుంది. 12:15 నిమిషాలకు ప్రధాని మోదీ తిరిగి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:10గంటలకు మోదీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోదీ వరంగల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాజీపేట‌లో వ్యాగన్‌ల తయారీ యూనిట్‌కు, అలాగే జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

Updated On 4 July 2023 3:10 AM GMT
Ehatv

Ehatv

Next Story