వరంగల్‌(Warangal) జిల్లాలో ఓ యువతి స్నేహితుడని నమ్మి మోసపోయింది.

వరంగల్‌(Warangal) జిల్లాలో ఓ యువతి స్నేహితుడని నమ్మి మోసపోయింది. స్నేహితుడని వెంట వెళ్తే మరో ఇద్దరితో కలిసి ఆమెపై అత్యాచారం(Rape) చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శివకుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం భూపాలపల్లికి చెందిన ఓ యువతి నగర శివారులోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో ఫార్మసీ(Pharmcy) రెండో సంవత్సరం చదువుతోంది. కాలేజ్‌ దగ్గరలో ఉన్న హాస్టల్‌లో ఉంటోంది. సెప్టెంబర్ 15న ఆమె స్వస్థలానికి చెందిన తెలిసిన యువకుడొకరు హాస్టల్ దగ్గరికి వచ్చి మాట్లాడే పని ఉందని చెప్పాడు. హాస్టల్‌ నుంచి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే అందులో మరో ఇద్దరు యువకులు ఉండటంతో యువతి నిరాకరించింది. దీంతో బలవంతంగా కారులో నగరానికి తీసుకొచ్చారు. వరంగల్‌ కూరగాయల మార్కెట్ దగ్గరలో ఉన్న ఒక లాడ్జిలో రూం తీసుకున్నారు. అక్కడ యువతికి మద్యం తాగించి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాలేజీలో పరీక్షలుండటంతో ఫిర్యాదు చేయలేదని, సెలవులకు ఇంటికి వెళ్లిన తర్వాత అత్యాచారం విషయాన్ని యువతి తల్లికి చెప్పింది. తల్లి, కూతురు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ను కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు సూచన మేరకు మంగళవారం ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు కసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story