హైదరాబాద్(Hyderabad) మహానగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఓఆర్ఆర్ ను నిర్మించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. భవిష్యత్ తరాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని, అభివృద్ధిని అందించాలని ఓఆర్ఆర్ నిర్మించిందని.. అందుకు 6,696 కోట్లు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్ల‌డించారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి ప్రభుత్వం టోల్ విధానం తీసుకొచ్చిందని తెలిపారు.

హైదరాబాద్(Hyderabad) మహానగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఓఆర్ఆర్ ను నిర్మించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. భవిష్యత్ తరాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని, అభివృద్ధిని అందించాలని ఓఆర్ఆర్ నిర్మించిందని.. అందుకు 6,696 కోట్లు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్ల‌డించారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి ప్రభుత్వం టోల్ విధానం తీసుకొచ్చిందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(Hyderabad Growth Corridor Limited) ను ఏర్పాటు చేసి టోల్ వసూలు చేసే ఏర్పాటు చేసింది. ప్రతీ ఏటా ప్రభుత్వానికి 750 కోట్ల టోల్ ఆదాయం ఉంది. అలాంటి ఆదాయం ఉన్న ఓఆర్ఆర్ ను 7,388 కోట్లకు ముంబై సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు.

ఏడాదికి 750 కోట్లు వస్తుంటే.. 246 కోట్లకే ముంబై కంపెనీకి కట్టబెట్టిందని అన్నారు. బంగారు బాతును కేటీఆర్ 30 ఏళ్లకు ఓఆర్ఆర్ ను తెగనమ్మారని ఆరోపించారు. ఆరునెలల్లో దిగిపోయే ముందు ప్రభుత్వం ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిన్నటి నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చి.. 24గంటలు తిరక్కముందే మరిచారని దుయ్య‌బ‌ట్టారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదని అన్నారు.

టోల్ కు సంబంధించి టెండ‌ర్ ప్రక్రియ లో పాల్గొన్న కంపెనీల వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు స‌చివాల‌యానికి వెళ్లాన‌ని పేర్కొన్నారు. కానీ పోలీసులు చుట్టుముట్టి నన్ను అడ్డుకున్నారు. హెచ్ఎండీఏ కార్యాలయం ఇంకా షిఫ్ట్ కాలేదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇస్తే అక్‌నాలెడ్జి పై రబ్బరు స్టాంప్‌ కూడా వేయలేదు.. సెక్రటేరియట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాధానమిచ్చారు. అరవింద్ కుమార్ ఇక్కడ లేరు, అక్కడ లేరు.. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారా? అని ప్ర‌శ్నించారు.

లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారని ఆరోపించిన రేవంత్‌.. ఇది వేల కోట్ల కుంభకోణమ‌ని.. ప్రభుత్వ ఆస్తిని తెగనమ్మడమేన‌న్నారు. ఈ దోపీడీ వెనక కేటీఆర్, కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదన్నారు. దీనిపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం.. న్యాయస్థానాల తలుపు తడతామ‌ని.. కేటీఆర్ ను జైల్లో పెట్టే వరకు పోరాడుతామ‌ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. పరిపాలన భవనంలోకి ఎంపీకి అనుమతి ఎందుకు? అని ప్ర‌శ్నించారు. కిలోమీటర్ దూరంలోనే నన్ను అడ్డుకున్నారు.. కనీసం గేటు వరకు కూడా రానివ్వలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్ల పై విచారణ చేయిస్తాం.. ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.

Updated On 1 May 2023 6:47 AM GMT
Ehatv

Ehatv

Next Story