తెలంగాణతో(Telangana) నాకు 2008 నుంచి అనుబంధం ఉందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం(P.Chidambaram) అన్నారు. గాంధీభవన్ లో(Gandhi Bhavan) ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన నాకు బాగా గుర్తుంద‌న్నారు. రాష్ట్రంలో కేసీఆర్(KCR) సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిందని..

తెలంగాణతో(Telangana) నాకు 2008 నుంచి అనుబంధం ఉందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం(P.Chidambaram) అన్నారు. గాంధీభవన్ లో(Gandhi Bhavan) ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన నాకు బాగా గుర్తుంద‌న్నారు. రాష్ట్రంలో కేసీఆర్(KCR) సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిందని.. దేశంలో‌నే అత్యధిక ద్రవ్యోల్బణం(LGP) ఉన్న రాష్ట్రం తెలంగాణే.. జాతీయ సగటు కన్న ఎక్కువ.. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయన్నారు. పాల ధరలూ విపరీతంగా ఉన్నాయన్నారు.

పెట్రోల్(Petrol), డీజిల్(Diseal) ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి. వ్యాట్(WAT) ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణేన‌న్నారు. గ్యాస్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉందని అన్నారు. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికం.. రాష్ట్రంలో 15.1 శాతంగా ఉందని వివ‌రించారు. 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలేదని అన్నారు. టీఎస్‌పీఎస్సీలో 22 లక్షల‌ మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు.. వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయిందని విమ‌ర్శించారు. ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో స‌ర్కార్‌ ఘోరంగా విఫలమైందన్నారు.

రాష్ట్ర అప్పులు‌ 3.66 లక్షల కోట్లకు పెరిగింది.. ఏటేటా అప్పులు భారీగా పెరిగాయి.. ఫలితంగా ఒక్కొక్కరిపై 96 వేల రూపాయల అప్పు భారం పడిందన్నారు. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారిందన్నారు. విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయ‌న్నారు. పోషకాహార లోపం‌ తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో‌ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు.. ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి కారణమయ్యాయని వివ‌రించారు. కాంగ్రెస్‌కి(Congress) అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామ‌న్నారు.

Updated On 16 Nov 2023 8:37 AM GMT
Ehatv

Ehatv

Next Story