భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు తెలంగాణలోని

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గురువారం సాయంత్రం చేపట్టిన రోడ్‌షోలో కొందరు వ్యక్తులు ఉల్లిపాయలు, టమోటాలు విసిరారు. రామారావు కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. కొందరు నిరసనకారులు BRS నాయకుడికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, ఆయన వాహనం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ ఓట్ల కోసం రాముడి పేరును ఉపయోగించడాన్ని విమర్శించడం ద్వారా తమ మనోభావాలను దెబ్బతీసినందుకు కేటీఆర్ పై ఈ బృందం నిరసన వ్యక్తం చేసింది.

చౌకబారు పనులు చేయవద్దని కేటీఆర్ నిరసనకారులకు సూచించారు. సభకు ఆటంకం కలిగించే వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. పోలీసులు నిరసనకారులను ఆపడానికి ప్రయత్నించారు. ఈ గందరగోళం మధ్య, కొంతమంది ఉల్లిపాయలు, టమోటాలు విసిరారు, అవి కేటీఆర్ ప్రచార వాహనం దగ్గర పడిపోయాయి. నిరసన మధ్యే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

Updated On 9 May 2024 9:29 PM GMT
Yagnik

Yagnik

Next Story