దమ్ము ఉంటే మళ్ళీ ఎన్నికలు పెట్టండి మొత్తం మేమే గెలుస్తాం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడం ఆయన అవివేకం అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.

దమ్ము ఉంటే మళ్ళీ ఎన్నికలు పెట్టండి మొత్తం మేమే గెలుస్తాం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడం ఆయన అవివేకం అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టారు. ఇప్పటికే రెండు సార్లు.. ఒకసారి అసెంబ్లీ, మరోసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ దమ్ము ఏందో చూపించామన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి.. ఎన్నికలు జరిగినపుడు దమ్ము చూపించాలి. అప్పుడు మీ దమ్ము ఏందో జనం చూశారు. 119 సీట్లలో 8 సీట్లు మీకు వచ్చాయి. మీకు ఎంత దమ్ము ఉందో అప్పుడే అర్థం అయ్యింది. ఇంకా సిగ్గులేకుండా దమ్ము గురించి మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. మీకు అంత దమ్ము ఉంటే వచ్చే ఎన్నికల వరకు దాచిపెట్టుకోండి.. ఎన్నికలలో దమ్ము చూపించండన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు చీకటి ఒప్పందం చేసుకున్న కూడా 8 సీట్లు గెలవలేకపోయారన్నారు. ఇంకా దమ్ము గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. అంత దమ్ము ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల గురించి కోట్లాడి తెచ్చి రాష్ట్రానికి మేలు చేయండన్నారు.

Eha Tv

Eha Tv

Next Story