కవితను చూసేందుకు వెళ్లిన‌ కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడ‌టం చూసి బాధేస్తుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు

కవితను చూసేందుకు వెళ్లిన‌ కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడ‌టం చూసి బాధేస్తుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయ‌న కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న‌ స్పందిస్తూ.. పవర్ ఉన్నప్పుడు యువరాజుగా వుండే కేటీఆర్.. పవర్ పోయాక తికమక మాట్లాడుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులు చేసిందే బీఆర్ఎస్, బీజేపీ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ కాదా అని ప్ర‌శ్నించారు.

ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి మా పార్టీలో చేరుతున్నారని అన్నారు. మేము ఏమి వారిని రమ్మని అడగడంలేదన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించింది బీఆర్ఎస్, బీజేపీలేన‌న్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా.. తెలంగాణ ఇచ్చే సమయంలో కేసీఆర్ కుటుంబం మొత్తం సోనియా కాళ్ళమీద పడలేదా.. అని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామ‌ని చెప్పలేదా.. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్.. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకోలేదా.. కేటీఆర్‌ మీ బాగోతం అంతా అందరికీ తెలుస‌న్నారు.

Eha Tv

Eha Tv

Next Story