రుతుపవనాలు జూన్ 6 నాటికి రాయలసీమకు చేరుకుంటాయి

భారతదేశం రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. జూన్ 1న కేరళలో రుతుపవనాలు వచ్చాక షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చేరుకోవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు.

రుతుపవనాలు జూన్ 6 నాటికి రాయలసీమకు చేరుకుంటాయి, ఆపై తెలంగాణకు చేరుకుంటాయి. గతేడాది మే 19న రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రంలో ప్రవేశించాయి. జూన్, సెప్టెంబర్ మధ్య రుతుపవనాల జల్లులు దక్షిణ ద్వీపకల్పంలో 106 శాతం దీర్ఘకాలిక సగటు (LPA)లో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఏప్రిల్‌లో IMD నివేదిక పేర్కొంది. ఈ సమయంలో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలతో పాటూ.. ఈ సమయంలో గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

Updated On 15 May 2024 1:59 AM GMT
Yagnik

Yagnik

Next Story