ప్రియురాలికి పిజ్జా(Pizza) ఇవ్వడానికి వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత ప‌డ్డాడు. వివ‌రాళ్లోకెళితే.. మహమ్మద్ షేయబ్(Mohammed Shayab)(19) అనే యువకుడు బోరబండ లోని ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. షోయబ్‌కు అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ప్రియురాలికి పిజ్జా(Pizza) ఇవ్వడానికి వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత ప‌డ్డాడు. వివ‌రాళ్లోకెళితే.. మహమ్మద్ షేయబ్(Mohammed Shayab)(19) అనే యువకుడు బోరబండ లోని ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. షోయబ్‌కు అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్ర‌మంలోనే ప్రియురాలు పిజ్జా(Pizza) తినాలనిపిస్తుందని షోయబ్‌కు చెప్పింది. ఆమె కోరిక మేరకు ఆదివారం రాత్రి సమయంలో షోయబ్ పిజ్జా తీసుకొని యువ‌తి ఇంటికి వెళ్ళాడు. అదే సమయంలో యువతి తండ్రి రావడం గమనించిన షోయబ్.. భ‌యంతో నాలుగో అంతస్తు పైనుండి క్రిందికి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన షోయబ్ ను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న షోయబ్.. ఈరోజు ఉదయం మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Updated On 8 Aug 2023 4:47 AM GMT
Ehatv

Ehatv

Next Story