ఎమ్మెల్సీ క‌విత రాక్షబంధ‌న్‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. త‌న అన్న‌, మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండ‌గా.. మ‌రో సోద‌రుడు(క‌జిన్‌) రాజ్యసభ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. మ‌రో సోదరి సౌమ్య జోగినిపల్లితో సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లిన కవిత..

ఎమ్మెల్సీ క‌విత రాక్షబంధ‌న్‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. త‌న అన్న‌, మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండ‌గా.. మ‌రో సోద‌రుడు(క‌జిన్‌) రాజ్యసభ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. మ‌రో సోదరి సౌమ్య జోగినిపల్లితో సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లిన కవిత.. ఆయ‌న‌కు రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఎంపీ సంతోష్‌ ట్విట్టర్ లో షేర్‌చేశారు.

నా ప్రియమైన సోదరీమణులు ప్రేమ, రక్షణకు ప్రతీక అయిన రాఖీని కట్టేటప్పుడు వారితో ఉన్న బంధాన్ని ఎంతో ఆదరిస్తున్నాను. జీవితాన్ని అందంగా మార్చే శాశ్వత బంధాల‌కు కృతజ్ఞతలు. నా చెల్లెల‌కు ధన్యవాదాలు. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

అలాగే.. మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫోటోను క‌విత ట్విట‌ర్‌లో షేర్ చేశారు. అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘నా’ కలిపితే ‘అన్న’ అంటూ కవిత ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.

Updated On 31 Aug 2023 2:55 AM GMT
Ehatv

Ehatv

Next Story