✕
బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

x
బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. బీజేపీనీ వదిలి వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు తనకు బ్రోకరిజం చేయడం రాదని.. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే తన సూచనలు పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీతో తిరిగే వ్యక్తికి ఇచ్చారని ఆవేదన చెందారు. ఎందుకు ఇలా చేశారు అని ఒక కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారని.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నాను, వెంటనే గోల్కొండ జిల్లా అధ్యక్షుడి పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని రాజాసింగ్ హెచ్చరించారు.

ehatv
Next Story