తెల్లావారుజామున కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌‌పై ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పీఏ ఆకాశ్‌ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా ఆమె కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

తెల్లావారుజామున కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కంటోన్మెంట్ లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాన్ని నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు.

Updated On 22 Feb 2024 9:08 PM GMT
Yagnik

Yagnik

Next Story