ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోద‌య్యింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోద‌య్యింది. జూబ్లీహిల్స్ రోడ్ నం 69 నందగిరిహిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలమైన పార్కు ప్రహరీని ఈ నెల 10న కూల్చేసినట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు గుర్తించారు. పార్కు గోడను ఎమ్మెల్యే, అతని అనుచరులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (EV&DM) ఇన్‌ఛార్జ్ వి పాపయ్య చేసిన‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎమ్మెల్యే స‌మ‌క్షంలో గురుబ్రహ్మనగర్ కి చెందిన గోపాల్ నాయక్, రాంచందర్ తదితరులు కూల్చివేత ఘటనలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రహరీ కూల్చివేతతో రూ. 10 లక్షల మేర కు నష్టం వాటిల్లిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో దానం నాగేందర్ ను A3గా చేర్చారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story