చెవువులలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా(HYDRA) తర్వాతి లక్ష్యం ఓవైసీ బ్రదర్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

చెవువులలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా(HYDRA) తర్వాతి లక్ష్యం ఓవైసీ బ్రదర్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓవైసీ బ్రదర్స్‌కు చెందిన అక్రమ కట్టడాలపై ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు(Ranganath) ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ(Akbadruddin Owaisi) కూల్చివేతలపై రియాక్టయ్యారు. కావాలంటే తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి కానీ ఆ స్కూల్ కూల్చకండి అని ఎక్స్‌ ద్వారా రిక్వెస్ట్‌ చేశారు. పేదలకు ఉచిత విద్యను అందించడానికే 12 బిల్డింగ్‌లను నిర్మాంచామని, వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయిండి కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story