ఈ సందర్బంగా అంక్సాపూర్,పడగల్ గ్రామాల ప్రజలు మంత్రికి గ్రామస్థులు, డప్పు చప్పుళ్లతో, టపాసులు కాలుస్తూ మహిళలు మంగళ హారతులతో అఖండ స్వాగతం పలికారు.
అంక్సాపూర్ సంత మల్లన్న దేవాలయాన్ని మంత్రి సందర్శించి మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇంటి వేల్పు అయిన సంత మల్లన్న కు సాష్టాంగ నమస్కారం చేసి మంత్రి వేముల మొక్కులు చెల్లించారు.

నిజామాబాద్ జిల్లా(Nizambad) వేల్పూర్(Velpur) మండలం అంక్సాపూర్,పడగల్ గ్రామాల్లో సుమారు 17 కోట్ల విలువగల పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) శనివారం శంకుస్ధాపనలు చేశారు.

ఈ సందర్బంగా అంక్సాపూర్,పడగల్ గ్రామాల ప్రజలు మంత్రికి గ్రామస్థులు, డప్పు చప్పుళ్లతో, టపాసులు కాలుస్తూ మహిళలు మంగళ హారతులతో అఖండ స్వాగతం పలికారు.
అంక్సాపూర్ సంత మల్లన్న దేవాలయాన్ని మంత్రి సందర్శించి మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇంటి వేల్పు అయిన సంత మల్లన్న కు సాష్టాంగ నమస్కారం చేసి మంత్రి వేముల మొక్కులు చెల్లించారు.

ఉదయం అంక్సాపూర్ గ్రామంలో,మధ్యాహ్నాం పడగల్ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సంత మల్లన్న దేవాలయం షెడ్ శంకుస్థాపన(Foundation) 25 లక్షల వ్యయంతో,సంతమల్లన్న దేవాలయం గిరి ప్రదక్షిణ రోడ్ శంకుస్థాపన 2.20 కోట్ల వ్యయంతో,అంక్సాపూర్ నుండి వేల్పూర్ డబుల్ లెన్ రోడ్ శంకుస్థాపన 8.10 కోట్ల వ్యయంతో,అంక్సాపూర్ నుండి వడ్డెర కాలనీ వయా సంత మల్లన్న రోడ్ శంకుస్థాపన 40 లక్షల వ్యయం,హెల్త్ సబ్ సెంటర్ పనుల శంకుస్థాపన 20 లక్షల వ్యయం,పోచమ్మ దేవాలయం నిర్మాణ పనులు శంకుస్థాపన 15 లక్షల వ్యయం,హనుమాన్ దేవాలయం నిర్మాణ పనుల శంకుస్థాపన 30 లక్షల వ్యయంతో...
పడగల్ గ్రామంలో హైవే నుండి పడగల్ వరకు బిటి రోడ్ రిన్వల్ పనుల శంకుస్థాపన 1.74 కోట్లు వ్యయం,పడగల్ బిటి రోడ్ పై 9/0 -2 కి.మీ వద్ద మైనర్ బ్రిడ్జి నిర్మాణ పనులు శంకుస్థాపన 1.40 కోట్ల వ్యయం, పడగల్ గ్రామ బిటి రోడ్ పై 10/2 కి.మీ వద్ద స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులు 40 లక్షల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం గ్రామ ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు..

అంక్సాపూర్, పడగల్ గ్రామ అభివృద్ది చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం కలుగుతున్నదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగిన మట్టి రోడ్డు ఎమ్మెల్యే అయ్యాక డాంబర్ రోడ్డు అయ్యిందని,ఇప్పుడు డబుల్ రోడ్డు అవుతుందని, అంక్సా పూర్ సట్టి తీర్దాలకు ఎడ్ల కచ్చురం మీద వచ్చి మూడు రోజుల పాటు అక్కడే తన మేనత్త ఇంట్లో ఉండేదని అప్పటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. ఒకప్పటి అంక్సాపూర్ ను ఇప్పటి అంక్సాపూర్ గ్రామాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తి కలుగుతుందని,ఇంతకు మించిన ఆత్మ తృప్తి మరోటి ఉండదని అమితానందం వ్యక్తం చేశారు. ఒక్క ఈ గ్రామంలోనే 39 కోట్ల అభివృద్ది చేశామని 750 మందికి 11 కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. సొంత జాగ ఉండి ఇండ్లు లేని అర్హులైన పేదలకు విడతల వారీగా,నిరంతరాయంగా గృహ లక్ష్మి కింద 3లక్షలు ఇస్తామని వెల్లడించారు. కేసిఆర్ తోనే తెలంగాణ పల్లెల్లో అసాధారణ అభివృద్ది సాధ్యమయ్యిందని,కాళేశ్వరం నీళ్లతో ఊర చెరువులు కళకళ లాడుతున్నాయని అన్నారు.అభివృద్ధి,పాడి పంటలు,కుల వృత్తులకు చేయూతతో గ్రామాలు సంబురంగా మారాయన్నారు.కెసిఆర్ సంపద సృష్టించి..పేదలకు పంచుతున్నాడన్నారు. 36 వేల కోట్ల రైతు రుణమాఫి ఘనత ఒక్క కేసిఆర్ కే దక్కుతుందని, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసం చేయలేదని అన్నారు. రైతు బంధు లాంటి పథకంతో రైతులకు ఆర్ధిక భరోసా ఇయ్యాలన్న కనీస ఆలోచన ఏ నాయకుడు చేయలేదన్నారు. కానీ ఇప్పుడు మేము కేసిఆర్ కంటే ఎక్కువ చేస్తామని అర్రాసు పాట తీరుగా పథకాలు ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ వి గట్టి చేతలు..కాంగ్రెస్ వి ఉట్టి మాటలని,రామ - రావణ యుద్ధంలో మిగిలిన రాక్షసులు కొంత మంది మనిషి రూపంలో గ్రామాల్లో ఇంకా తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కథ కూడా ఎంపి అర్వింద్ బాండ్ పేపర్ లాంటి ఉత్తి మాటే అని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ కు హైకమాండ్ ఢిల్లీ వయా బెంగుళూరు అయితే,బీజేపీ కి హైకమాండ్ ఢిల్లీ వయా గుజరాత్ అని అన్నారు. కానీ కేసిఆర్ కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు.
తెలంగాణ బిడ్డ కేసిఆర్ కు తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని,గోస పడ్డ జీవితాల్లో వెలుగులు నింపిన కేసిఆర్ కు తోడుగా నిలబడాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు,స్థానిక ప్రజాప్రతినిధులు,ఆర్డీవో వినోద్ కుమార్, ఏసిపి జగదీష్ చందర్,పలువురు మండల బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated On 23 Sep 2023 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story