మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టీ సంస్థ‌(L&T Organisation) ప్రతినిధులతో సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సమావేశమ‌య్యారు. సమావేశంలో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్.

మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టీ సంస్థ‌(L&T Organisation) ప్రతినిధులతో సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సమావేశమ‌య్యారు. సమావేశంలో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్(S.V Desai) పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. స‌మావేశంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేశారని, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేశారని వారిని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలనుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని.. తప్పు చేసిన వారు తప్పించుకోవాల‌ని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

Updated On 18 Dec 2023 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story