మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు.

మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. ఈ మేర‌కు ఆమె కేసీఆర్ సహా బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు పంపారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసుర రాజ్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క తో పాటు మంత్రుల‌పై గత కొంతకాలంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు. జూన్ 24న బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారని వివ‌రించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని సీతక్క మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని సీతక్క కోరారు.

Eha Tv

Eha Tv

Next Story