హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో(Congress Leaders) మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సమావేశమ‌య్యారు. మంత్రి పొన్నం హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే గాంధీ భవన్(Gandhi Bhavan) లో నగర కాంగ్రెస్ నాయకులతో మంత్రి పొన్నం స‌మావేశ‌మ‌య్యారు.

హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో(Congress Leaders) మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సమావేశమ‌య్యారు. మంత్రి పొన్నం హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే గాంధీ భవన్(Gandhi Bhavan) లో నగర కాంగ్రెస్ నాయకులతో మంత్రి పొన్నం స‌మావేశ‌మ‌య్యారు. పొన్నం ప్రభాకర్ తోపాటు మాజీ ఎంపీ లు వి.హనుమంతరావు(V hanumanth Rao), అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav), పోటీ చేసిన అభ్యర్థులు, నగరంలోని వివిధ అనుబంధ సంఘాల ఛైర్మన్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయడంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని.. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని.. కాంగ్రెస్ క్యాడర్ పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలో 28వ తేదీ నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకూ ప్రజాపాలన కార్యక్రమాలు జరుగుతాయని.. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు సేవలందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విషయంలో కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి పని చేయాలని సూచించారు.

Updated On 26 Dec 2023 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story