కేసీఆర్ చవట దద్దమ్మ కాబ‌ట్టే ధనిక రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేశార‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్ చవట దద్దమ్మ కాబ‌ట్టే ధనిక రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేశార‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గాంధీ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయడు తన ప్రాంతానికి అన్యాయం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలి అనే వ్యాఖ్య‌ ప్రకారం కేసీఆర్ ను పాతి పెట్టాలన్నారు. పదేళ్లలో పంట నష్టంపై నివేదిక‌ ఎప్పుడైనా కేసీఆర్ ఇచ్చారా.? ఫామ్ హౌస్ లో పండి కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపారని అన్నారు.

నాలుగు మాసాల కాంగ్రెస్ పాలనను చూసి కేసీఆర్ ఉలిక్కి పడుతున్నారు. కేసీఆర్ కుర్చివేసుకొని కడుతా అన్న హామీలు ఒక్కటైనా అమలు అయ్యాయా? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ కు దమ్ముంటే మేడిగడ్డ‌ కాదు.. పాలమూరుకు పోదామా.? అని స‌వాల్ విసిరారు. మిషన్ భగీరథ లో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. సీఎం రేవంత్ 12 సార్లు ఢిల్లీ పోయినా సోనియా, ఖర్గే అపాయింట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్నా మంత్రులను కలవలేదన్నారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క లోక్ సభ సీటు కూడా రాదన్నారు. కేసీఆర్ వ్యవహారాలను మేము పక్కన ఉండి చూశాం. కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్తితి లేదన్నారు.

Updated On 6 April 2024 6:57 AM GMT
Yagnik

Yagnik

Next Story