చెట్టెక్కి ప్రచారం చేస్తే ప్రజల చెవికెక్కుతుందనుకున్నారో ఏమో కానీ తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli krishna rao) చెట్టెక్కి మరీ ప్రచారం చేశారు. తాము చేస్తున్న పనుల గురించి చెబుతూనే ఎప్పటిలాగే బీఆర్‌ఎస్‌ను తిట్టిపోశారు. కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం, రాష్ట్రంలోని గత బీఆర్‌ఎ(BRS)స్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు.

చెట్టెక్కి ప్రచారం చేస్తే ప్రజల చెవికెక్కుతుందనుకున్నారో ఏమో కానీ తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli krishna rao) చెట్టెక్కి మరీ ప్రచారం చేశారు. తాము చేస్తున్న పనుల గురించి చెబుతూనే ఎప్పటిలాగే బీఆర్‌ఎస్‌ను తిట్టిపోశారు. కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం, రాష్ట్రంలోని గత బీఆర్‌ఎ(BRS)స్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. (అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు ఈయన ఆ బీఆర్‌ఎస్‌లోనే ఎమ్మెల్యేగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి). ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయి కాట్టే గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కమలం పార్టీని ఓడించాలని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖలను నిర్వహిస్తున్న మంత్రి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ మండలం బోడబండ తాండ గ్రామంలో మంత్రి జూప‌ల్లి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో గిరిజ‌న మ‌హిళ‌లు, వృద్దుల‌తో స‌ర‌ద‌గా మాట్లాడారు. త‌న చిన్న నాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందంటే అమలుచేసి తీరుతుంద‌ని తెలిపారు. రాష్ట్రం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆరు గ్యారంటీల త‌ర‌హాలోనే కేంద్రంలో ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పాంచ్ న్యాయాల‌ను అమ‌లు చేస్తుంద‌ని చెప్పారు.

Updated On 20 April 2024 6:09 AM GMT
Ehatv

Ehatv

Next Story