తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు(Heavy rais) కుదిపేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు(Heavy rais) కుదిపేస్తున్నాయి. చాలా గ్రామాలు నీట మునిగాయి. జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు జలమయమయ్యాయి. రవాణా(Transport) స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి(Mega star chiranjeevi) ఎక్స్‌ ద్వారా ఓ సందేశం పంపించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆయన సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే 'తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. ఇప్పుడు కూడా అదే విధంగా అభిమానులంతా అండగా నిలుస్తారని.. అవసరమైన వారికి చేయూత అందిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story