కేటీఆర్, హరీష్ రావు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

కేటీఆర్, హరీష్ రావు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ నేతలను మించిన పవర్ బ్రోకర్లు ఇంకెవరు లేరన్నారు. పది సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని విమ‌ర్శించారు.

తాము చేస్తే సంసారం..వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం లా హరీష్ రావు, కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ పాలనలో సొంత పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలను కూడా కలవని నీచ చరిత్ర కేసీఆర్ ద‌ని విమ‌ర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తలచుకుంటే 24 గంటల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంద‌న్నారు. తెలంగాణ భవన్ అయిన పార్టీ ఆఫీస్ ను మూసివేసి స్టార్ హోటల్ గా మార్చి బిజినెస్ చేసుకుంటే హరీష్,కేటీఆర్ కు మంచిదని సూచించారు.

Updated On 30 March 2024 8:10 AM GMT
Yagnik

Yagnik

Next Story