సిద్దిపేట(Siddipet) జిల్లా దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం(Dubbaka constituency) దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో(Election Campaing) ఉన్న మెదక్(Medak) ఎంపీ, బీఆర్ఎస్(BRS) దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై(Kotha Prabhakar Reddy) దాడి జ‌రిగింది.

సిద్దిపేట(Siddipet) జిల్లా దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం(Dubbaka constituency) దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో(Election Campaing) ఉన్న మెదక్(Medak) ఎంపీ, బీఆర్ఎస్(BRS) దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై(Kotha Prabhakar Reddy) దాడి జ‌రిగింది. ప్ర‌చారంలో ఉన్న ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి దాడి చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌చార హ‌డావుడిలో ఉన్న ప్ర‌భాక‌ర్ రెడ్డి పైకి హఠాత్తుగా దూసుకు వచ్చిన రాజు.. ఆయన కడుపు భాగంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రభాకర్ రెడ్డికి గాయాలయ్యాయి.

దాడికి పాల్ప‌డిన రాజుపై(Raju) అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన ప్రభాకర్ రెడ్డిని ప్రాధ‌మిక‌ చికిత్స అనంత‌రం హైద్రాబాద్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 30 Oct 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story