మంథనిలో(Manthani) దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) ఎమ్మెల్యేగా ఐదవ సారి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల కోసం కృషి చేస్తామ‌ని తెలిపారు. వ్యవస్థలను చేతిలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలను గుర్తుపెట్టుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.

మంథనిలో(Manthani) దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) ఎమ్మెల్యేగా ఐదవ సారి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల కోసం కృషి చేస్తామ‌ని తెలిపారు. వ్యవస్థలను చేతిలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలను గుర్తుపెట్టుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలతో పాటు మేనిఫెస్టోలో(Manifesto) పేర్కొన్న ప్రతి హామీని నిలబెట్టుకుంటామ‌న్నారు.

మంథని ప్రాంతంలో రౌడీయిజం, గుండాయిజం ఉండకూడదని, ఇక్కడ శాంతి నెలకొనాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కావాలన్నారు. ధరణి(Dharani), సాగునీటి అంశం, రోడ్లు ఇతర అంశాలపై ఒక ప్రణాళికతో అభివృద్ధి చేస్తామ‌న్నారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకునికి అన్ని వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు

Updated On 3 Dec 2023 6:49 AM GMT
Ehatv

Ehatv

Next Story