వరంగల్‌(Warangal) నగరంలో ఓ నిత్యపెళ్లికొడుకు బాగోతం ఇది! అతడి పేరు రాజేశ్‌(Rajesh). హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడంలో ఎక్స్‌పర్ట్. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో యువతితో తిరుగుతుండటంతో అనుమానం వచ్చి మూడో భార్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రాజేశ్‌ పెళ్లిళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది.

వరంగల్‌(Warangal) నగరంలో ఓ నిత్యపెళ్లికొడుకు బాగోతం ఇది! అతడి పేరు రాజేశ్‌(Rajesh). హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడంలో ఎక్స్‌పర్ట్. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో యువతితో తిరుగుతుండటంతో అనుమానం వచ్చి మూడో భార్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రాజేశ్‌ పెళ్లిళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. 2022 ఫిబ్రవరిలో వరంగల్‌లోని చార్‌ బౌలీకి చెందిన సుమనప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది మే మాసంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రావణిని హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి జరిగి మూడు నెలలు కూడా కాలేదు. మూడో పెళ్లి కూడా కానిచ్చేశాడు. సుందరయ్యనగర్‌కు(Sundharaiah Nagar) చెందిన సారికను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. మొన్న ఫిబ్రవరిలో ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఆర్యసమాజంలో మూడు ముళ్లు వేశాడు. అలా మూడో పెళ్లిని కూడా విజయవంతంగా జరుపుకున్నాడు. ఈ ముగ్గురిని వేరు వేరు చోట్ల అద్దెకు ఉంచాడు. ఈ ముగ్గురిపై మొహమెత్తిందో ఏమో కానీ కరుణ అనే యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరగసాగాడు. సోమవారం సుందరయ్యనగర్‌కు వచ్చాడు రాజేశ్‌. అతడిని చూసిన సారిక తల్లిదండ్రులు గొడవకు దిగారు. వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు రాజేశ్‌. సారిక తల్లిదండ్రులు వెంటనే 100కు కాల్‌ చేశారు. వెంటనే బారిగంజ్‌ పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని రాజేశ్‌ కోసం గాలిస్తున్నారు. ఎవరికి విడాకులు ఇవ్వకుండా తన కూతురును మూడో పెళ్లి చేసుకున్న రాజేశ్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాలని సారిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Updated On 23 April 2024 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story