రంగారెడ్డి (Ranga reddy)జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియ ముగ్గురు పిల్లలను చంపిన(Murder) తండ్రి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ పల్లి(Shankarpally) మండలంలో సోమవారం ఉదయం జరిగింది. తన ముగ్గురు కుమారులు సాయికిరణ్ (13) మోహిత్ కుమార్ (10) ఉదయ్ కిరణ్ (7) ను అత్యంత దారుణంగా హతమార్చి, తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగారెడ్డి (Ranga reddy)జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియ ముగ్గురు పిల్లలను చంపిన(Murder) తండ్రి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ పల్లి(Shankarpally) మండలంలో సోమవారం ఉదయం జరిగింది. తన ముగ్గురు కుమారులు సాయికిరణ్ (13) మోహిత్ కుమార్ (10) ఉదయ్ కిరణ్ (7) ను అత్యంత దారుణంగా హతమార్చి, తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టంగుటూరుకు చెందిన రవి మనీ స్కీం పేరుతో చుట్టుపక్కల గ్రామాల్లో పలువురితో డబ్బులు(Debts) కట్టించాడు. ఈ స్కీం ద్వారా రూ. వెయ్యికి రూ. 3వేలు, 58 రోజుల వ్యవధికి రూ లక్షకు రూ 5లక్షలు ఇప్పిస్తానంటా డబ్బులు కట్టించాడు.

ఈ మనీ స్కీం పేరుతో స్థానికుల నుంచి భారీగా డబ్బులు కట్టించాడు. డబ్బుకు ఆశపడి కట్టినవారంతా తిరిగి తమ డబ్బు చెల్లించాలని రవిపై(Ravi) ఒత్తిడి చేయసాగారు. ప్రతిరోజు తన ఇంటికి రాసాగారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. తన ఇంట్లో పిల్లలను చంపి తాను పంట పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య శ్రీలత, కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోకిలా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Updated On 4 March 2024 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story