సమాజంలో కొందరు మనుషులు ఎంతకు బరితెగిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. దరిద్రపు సంబంధానికి అడ్డుగా ఉందని 22 ఏళ్ల చిన్నారిని తీవ్రంగా హింసించి దారుణంగా చంపారు.

సమాజంలో కొందరు మనుషులు ఎంతకు బరితెగిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. దరిద్రపు సంబంధానికి అడ్డుగా ఉందని 22 ఏళ్ల చిన్నారిని తీవ్రంగా హింసించి దారుణంగా చంపారు. ఈ లోకాన్ని ఇప్పుడిప్పుడే చూసేందుకు సిద్ధమవుతున్న అభంశుభం తెలియని చిన్నారిని అతి కిరాతకంగా చంపారు. తమ సంబంధానికి అడ్డు వస్తుందని చిన్నారిని హింసించి నేలకేసి కొట్టి చంపిన ఘటన సూర్యాపేట(suryapet) జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

నిజామాబాద్(Nizamab) జిల్లా రంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామానికి చెందిన రమ్య(Ramya) అలియాస్‌ నవ్యశ్రీని అదే జిల్లాకు చెందిన కటకట లక్ష్మణ్‌కు(Laxman) ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరిద్దరికి ఇద్దరు కూతుర్లు అరుణ్య (04), మహన్వి (22 నెలలు) ఉన్నారు. సవ్యంగా సాగుతున్న వీరి కాపురంలో చిచ్చుపెట్టేందుకు ఒకడు రానే వచ్చాడు. వాడే బొల్లెం అరవింద్‌రెడ్డి. ఇతగాడితో రమ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏకంగా భర్తను వదిలేసి ప్రియుడితో లేచిపోయేందుకు కూడా సిద్ధమైంది. అనుకున్నట్లుగానే 20 రోజుల క్రితం భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో కలిసి సొంతూరు నుంచి లేచిపోయింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అరవింద్‌రెడ్డి ఇటుకబట్టీల దగ్గర ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 22 ఏళ్ల చిన్నారి వీరు 'ఆ పని' చేసుకునేందుకు అడ్డుపడుతుందని అరవింద్‌రెడ్డి ఆ చిన్నారిపై ఆగ్రహం చెందాడు. చిన్నారి మహన్విని కొరికి, కొట్టి చిత్రహింసలకు గురిచేసి నేలకేసి బాదడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన రమ్య అత్త కటికట గంగామణి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చిన్నారి రెండు చెంపలు, చేతులు, భుజాలు, పిరుదులు, తలపై తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు.

Eha Tv

Eha Tv

Next Story