హైదరాబాద్‌(Hydearabad) నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌(Hydearabad) నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలి(Gachibowli) పోలీస్‌ స్టేషన్ పరిధిలో గోపన్‌పల్లి తండాలో ఓ అమ్మాయిని అన్యాయంగా చంపేశాడో దుర్మార్గుడు. పశ్చిమ బెంగాల్‌కు(West bengal) చెందిన పాతికేళ్ల దీపన తమాంగ్‌ నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని గోపన్నపల్లి తండా సమీపంలో నివాసం ఉంటుంది. కర్నాటకలోని బీదర్‌కు చెందిన రాకేశ్‌ అనే యువకుడు కూడా అక్కడే ఉంటున్నాడు. కొద్దిరోజులుగా దీపన వెంటపడుతున్నాడు రాకేశ్‌. నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడు. రాకేష్‌ ప్రపోజల్‌ను ఆమె నిరాకరించడంతో దీపనపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లాడు. ఆవేశంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న దీపన స్నేహితులు రాకేష్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపైనా దాడికి పాల్పడ్డాడు. రాకేశ్‌ దాడిలో దీపన చనిపోయింది. ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత రాకేశ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. మొయినాబాద్‌ సమీపంలో విద్యుత్‌ స్థంభం ఎక్కి కరెంట్‌ తీగలు పట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు గుర్తించి అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story