భాగ్య‌న‌గ‌రం న‌డిబొడ్డున‌ దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు(High Court) ముందు రోడ్డుపై హత్య తీవ్ర‌ క‌ల‌క‌లం రేపింది. డ‌బ్బుల విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య‌ జ‌రిగిన గొడ‌వ ఈ దారుణానికి దారితీసిన‌ట్లు తెలుస్తోంది. వివ‌రాళ్లోకెళితే.. రూ.10 వేల కోసం ఇద్ద‌రి మ‌ధ్య వాద‌న జ‌రిగింది. ఇరువురిలో ఓ వ్యక్తి కోపంతో కత్తితో విచాక్ష‌ణా ర‌హితంగా ఎదుటి వ్య‌క్తిపై దాడి చేశాడు. దీంతో ఆ వ్య‌క్తి ర‌క్త‌పు మ‌డుగులో కొట్టుమిట్టాడుతూ అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించాడు.

భాగ్య‌న‌గ‌రం న‌డిబొడ్డున‌ దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు(High Court) ముందు రోడ్డుపై హత్య తీవ్ర‌ క‌ల‌క‌లం రేపింది. డ‌బ్బుల విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య‌ జ‌రిగిన గొడ‌వ ఈ దారుణానికి దారితీసిన‌ట్లు తెలుస్తోంది. వివ‌రాళ్లోకెళితే.. రూ.10 వేల కోసం ఇద్ద‌రి మ‌ధ్య వాద‌న జ‌రిగింది. ఇరువురిలో ఓ వ్యక్తి కోపంతో కత్తితో విచాక్ష‌ణా ర‌హితంగా ఎదుటి వ్య‌క్తిపై దాడి చేశాడు. దీంతో ఆ వ్య‌క్తి ర‌క్త‌పు మ‌డుగులో కొట్టుమిట్టాడుతూ అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ రుద్రభాస్కర్‌, చార్మినార్ సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని ప‌రిశీలించారు. మృతుడిని హైకోర్టు గేట్ నంబర్-6 ఎదురుగా ఉన్న సులబ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న మిధున్ గా గుర్తించారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి వివ‌రాలు తెలియాల్సివుంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 4 May 2023 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story