రేవంత్ రెడ్డి మగాడివైతే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చెయ్యమని కేటీఆర్ మాట్లాడ్డం ఆయన రాజకీయ అవివేకానికి నిదర్శనం అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిప‌డ్డారు.

రేవంత్ రెడ్డి మగాడివైతే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చెయ్యమని కేటీఆర్ మాట్లాడ్డం ఆయన రాజకీయ అవివేకానికి నిదర్శనం అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ గా గెలిచాడు. కొడంగల్ ఎమ్మెల్యే గా గెలిచాడు. ముఖ్యమంత్రి కూడా అయ్యాడని వివ‌రించారు. రేవంత్ రెడ్డి ఒక్కడే గెల‌వ‌డం కాదు.. ఆయనతో పాటు 65 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నార‌ని అన్నారు.

మీకు రేవంత్ రెడ్డి ని చూస్తే భయం పట్టుకుంది.. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. మీవి వంద తప్పులు అవుతున్నాయి. శిశుపాలిడిని కృష్ణుడు ఛంపినట్టు మిమ్మల్ని కూడా జనం రాజకీయంగా చంపేస్తారని అన్నారు. ఇప్పటికైనా జనానికి మీరు చేసిన మోసాలు, తప్పులు తెలుసుకొని ప్రభుత్వానికి సహకరించాలని.. లేకపోతే జనం మిమ్మల్ని బోంద‌ పెడతారని హెచ్చ‌రించారు.

Updated On 8 March 2024 10:36 PM GMT
Yagnik

Yagnik

Next Story