తెలంగాణ(Telangana) ప్రజల బాగు కోసమే కాంగ్రెస్(congress) మేనిఫెస్టో(Manifesto) అని మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) తెలిపారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్ట్‌లో కేసీఆర్(KCR) సర్కార్ అవినీతికి పాల్పడిందన్నారు. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది.. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదన్నారు.

తెలంగాణ(Telangana) ప్రజల బాగు కోసమే కాంగ్రెస్(congress) మేనిఫెస్టో(Manifesto) అని మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) తెలిపారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్ట్‌లో కేసీఆర్(KCR) సర్కార్ అవినీతికి పాల్పడిందన్నారు. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది.. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదన్నారు. మోదీ(Modi), కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని అన్నారు. ఎప్పుడూ ఫాంహౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక.. అక్కడే ఉండిపోతారు.. జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ అంటరు అని ఎద్దేవా చేశారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారని మండిప‌డ్డారు.

ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామ‌న్నారు. కర్ణాటకలో చెప్పిన ప్రతి హామీనీ మేం నెరవేరుస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. మా తొలి లక్ష్యం.. మహాలక్ష్మి పథకం.. ప్రతి నెలా రూ. 2500, రూ. 500కే గ్యాస్, బస్సుల్లో ఫ్రీ జర్నీ అని వెల్ల‌డించారు.

Updated On 17 Nov 2023 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story