మహబూబ్‌నగర్‌లో(Mahaboobnagar) ఓ ప్రేమ జంట చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోక మానరు.

మహబూబ్‌నగర్‌లో(Mahaboobnagar) ఓ ప్రేమ జంట చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోక మానరు. ఒంటరి వృద్ధులు కనపడితే వారినే లక్ష్యంగా చేసుకుని రంగప్రవేశం చేస్తారు. మాయమాటలు చెప్పి వృద్ధులను బుట్టలో పడేసి వారి మెడలో ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లడమే వీరి పని. వృద్ధులకు మాటలు చెప్పి ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడ వారిని బెదిరించి ఆభరణాలు(Gold) దోపిడీ(Robbery) చేస్తారు. ఇలా ఐదు సార్లు చేయడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఈ లవర్స్‌ను పట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌లో ఈ దోపిడీలు జరిగాయి.

మహబూబ్‌నగర్‌లో ఓ కిలాడీ జంట(Couple) ఉంటోంది. మక్తల్‌ మండలం రుద్రసముద్రానికి(Rudra samudraniki) చెందిన షేక్‌ మహ్మద్‌ (36)కు సబాపది ఉమ (39) అనే మహిళతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. షేక్ మహ్మద్‌కు పెళ్లయినా భార్యను వదిలేసి జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉమతో ప్రేమలో పడిన తర్వాత అవసరాల కోసం దొంగతనాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధులను, వారు ధరించిన ఆభరణాలు చూస్తారు. ఆ తర్వాత మెల్లగా వారిని బుట్టలో వేసేందుకు రంగంలోకి దిగుతుంది ఉమ. ఎక్కడికి వెళ్లాలో అడిగి తెలుసుకుని, తాను కూడా అటే వెళ్తున్నానని ఆటోలో దింపుతానంటూ నమ్మబలుకుతుంది. అప్పటికే ఆటోతో సిద్దంగా ఉండే మహ్మద్‌ దాంట్లోకి ఎక్కిస్తారు. మాటలు చెప్తూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత బెదిరించి నగలు తీసుకొని వారిని అక్కడే వదిలేసి వెళ్తారు. నగలు ఇవ్వకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తారు. ఇలా ధర్మాపూర్ శివారులో ఓ మహిళను, నవాబ్‌పేట మండలం యన్మన్ గండ్ల గేట్, రుద్రారం శివారులో మరొకరిని టార్గెట్ చేశారు .రైస్ మిల్లుల దగ్గర మరో ఇద్దరు మహిళల నుంచి బంగారునగలు దోపిడి చేశారు. దీంతో వరుస సంఘటనలతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించారు. ఆటోలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఈ లేటెస్ట్‌ లవర్స్‌ అనుమానాస్పదంగా కనపడడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ఈ లవర్స్ దోపిడీ చిట్టా బయటపడింది. వీరి నుంచి 9 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని మాటలు నమ్మి మోసోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story