కాంగ్రెస్ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ పై బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఫైర్ అయ్యారు

కాంగ్రెస్ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ పై బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఫైర్ అయ్యారు. దీపాదాస్ మూన్షీ బెంగాల్ టైగర్.. తూటాలను ఎదుర్కొన్న నాయకురాలని పేర్కొన్నారు. ఆమెపై అడ్డగొలుగా నోరు పారేసుకుంటే సహించమ‌ని హెచ్చ‌రించారు.

దీపాదాస్ మూన్షీ పై వ్యాఖ్యలకు ఎన్వీ ఎస్ ఎస్ ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి దోహదపడిన నాయకురాలు దీపా దాస్ మున్షీ అని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తుందనే సర్వేలతో బీజేపీ నేతల బెంబేలెత్తుతుంద‌ని.. భయంతో బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

Updated On 19 Feb 2024 7:47 PM GMT
Yagnik

Yagnik

Next Story