హైదరాబాద్ అల్వాల్‌లో(Alwal) బీజేపీ(BJP) నేత‌ కిడ్నాప్(Kidnap) క‌ల‌క‌లం రేపింది. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరుపతి రెడ్డి(Tirupathi Reddy) కిడ్నాప్ కు గురయ్యారు. ఈ మేర‌కు తిరుపతి రెడ్డి భార్య సుజాత(Sujatha) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ అల్వాల్‌లో(Alwal) బీజేపీ(BJP) నేత‌ కిడ్నాప్(Kidnap) క‌ల‌క‌లం రేపింది. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరుపతి రెడ్డి(Tirupathi Reddy) కిడ్నాప్ కు గురయ్యారు. ఈ మేర‌కు తిరుపతి రెడ్డి భార్య సుజాత(Sujatha) పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమి విషయంలో ప్రత్యర్థులతో ఆయనకు వివాదం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుజాత పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆల్వాల్ తహసీల్దార్ కార్యాలయం(MRO Office) సమీపంలో ఆయనను కిడ్నాప్ చేశారని తెలిపారు. తహసీల్దార్ కార్యలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. ప్రత్యర్థులే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రెడ్డి స్వ‌స్థ‌లం జనగామ జిల్లా దుబ్బకుంటపల్లి. జ‌న‌గామ టికెట్ రేసులో ఉన్న తిరుపతి రెడ్డి.. రాజ‌కీయాల‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ఉన్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం హైదరాబాద్ కుషాయిగూడలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.

Updated On 14 July 2023 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story