వైఎస్సార్‌టీపీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల(Sharmila) త్వరలో కాంగ్రెస్(Congress) పార్టీలో చేరబోతున్నట్లు తమకు సమాచారం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు(KVP Ramachandra) వెల్లడించారు.

వైఎస్సార్‌టీపీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల(Sharmila) త్వరలో కాంగ్రెస్(Congress) పార్టీలో చేరబోతున్నట్లు తమకు సమాచారం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు(KVP Ramachandra) వెల్లడించారు. గన్నవరం(Ganavaram) విమానాశ్రయంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని(Rahul Gandhi) కలిసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి(Rajashekar Reddy) మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పని చేశారన్నారు. ఆయన బిడ్డ షర్మిల కూడా త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు నాకు సమాచారం ఉందన్నారు. కాంగ్రెస్ వాదిగా షర్మిల రాక‌ను ఆహ్వానిస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం కోసం తాము కృషి చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. కేవీపీ వెంట రాహుల్‌ను క‌లిసిన వారిలో ఏపీ పీసీసీ ఛీప్ గిడుగు రుద్రరాజు కూడా ఉన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై వీరివురు రాహుల్‌తో చర్చించారు.

Updated On 3 July 2023 5:38 AM GMT
Ehatv

Ehatv

Next Story