కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పుపై ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ప్రశ్నించారు. అప్పులు తప్పని చెప్పినోళ్లని దేనితో కొట్టాలని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పుపై ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ప్రశ్నించారు. అప్పులు తప్పని చెప్పినోళ్లని దేనితో కొట్టాలని ప్రశ్నించారు.

'రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు 80,500 కోట్లు తీసుకున్నారు. 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారు. అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..? ఎన్నికల హమీలేవీ తీర్చలేదు..! కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు..!! మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు ? 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు ?? బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా ?? అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి…అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి ? బీఆర్ఎస్ హయాంలో

అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం. ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచాం. తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చాం. కానీ..

ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల "అడ్రస్" ఎక్కడ ? రుణమాఫీ చేయకుండా..! రైతుభరోసా వేయకుండా..!! ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా..! నెలలపాటు జీతాలు ఇవ్వకుండా..!! ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు ? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు ?? రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా.. సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరం.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం' అంటూ ఎక్స్‌లో కేటీఆర్‌ పోస్టు చేశారు.

ehatv

ehatv

Next Story