ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు రద్దు వెనుక వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం దాగి ఉందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు

ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు రద్దు వెనుక వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం దాగి ఉందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గురువారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం భిన్నాభిప్రాయాలు చెబుతూ తెలంగాణ ప్రజలను, హైకోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో తన వైఖరిని తెలియజేయనుంది.

“హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు చేయబడిందని.. కానీ తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం మరోలా పేర్కొంది. ఇలా న్యాయవ్యవస్థను ఎలా తప్పుదోవ పట్టిస్తారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ సాధ్యాసాధ్యాలను ప్రశ్నించిన కేటీఆర్.. “రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుతుంది. ఈ ప్రాజెక్టుల కోసం ఎకరం భూమి అయినా సేకరించారా.? కొత్త భూమిని సేకరించకుండా వారు ఫార్మా సిటీ భూములను ఎలా పునర్వినియోగిస్తారు? అని ప్ర‌శ్నించారు.

ప్రభుత్వ స్టాండ్‌పై స్పష్టత కోరుతూ.. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేయడం వల్ల రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నష్టం వాటిల్లడమే కాకుండా వేలాది ఉద్యోగావకాశాలు కూడా కోల్పోతామ‌ని అన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.64 వేల కోట్ల పెట్టుబడితో 14 వేల ఎకరాల భూమిని ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకై కొనుగోలు చేసిందని చెప్పారు. ఇది ఇతర ప్రాజెక్టుల కోసం తిరిగి ఉపయోగించకూడ‌ద‌ని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి రైతులు ఇచ్చిన భూములను అవినీతి భూ ఒప్పందాలకు ఉపయోగించరాదని కేటీఆర్‌ ఉద్ఘాటించారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story