ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైందని కేటీఆర్‌ అన్నారు.

ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైందని కేటీఆర్‌ అన్నారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అన్నారు. 'అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారు.. గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు, కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటు, చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థికరంగంలో ఈ విధ్వంసం. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం, ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే.. రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరం.. కేసిఆర్ గారి పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి, ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర” ఇదేనా..? జై తెలంగాణ' అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

ehatv

ehatv

Next Story