మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌కు ఊహించని ఎదురు దెబ్బ త‌గల‌నుంది. బీజేపీ కీల‌క నేత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేర‌నున్న‌ట్లు తెలుస్తుంది.

మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌కు ఊహించని ఎదురు దెబ్బ త‌గల‌నుంది. బీజేపీ కీల‌క నేత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేర‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు కాంగ్రెస్ నేత‌లు నిన్న రాత్రి ఆయ‌న‌తో చర్చలు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. అనంత‌రం ఆయ‌న కాంగ్రెస్‌లో చేరిక‌పై నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం.

కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ వారిలో మైనంపల్లి హ‌న్మంత‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, కొలను హన్మంతరెడ్డి, భూపతిరెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. పీసీసీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకే కూన శ్రీశైలం గౌడ్ ను పార్టీలోకి రావాల్సిందిగా అహ్వానించిన‌ట్లు తెలుస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ త‌రుపున పోటీ చేసిన శ్రీశైలం గౌడ్ రెండో స్థానంలో నిలిచారు. గతంలో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆయ‌న‌ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు.

Updated On 4 April 2024 9:39 PM GMT
Yagnik

Yagnik

Next Story