నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భ‌గాంగా ఎండి పోయిన పంట పొలాలను పరిశీలించిన అనంత‌రం కేసీఆర్.. రైతులతో మాట్లాడనున్నారు.

నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భ‌గాంగా ఎండి పోయిన పంట పొలాలను పరిశీలించిన అనంత‌రం కేసీఆర్.. రైతులతో మాట్లాడనున్నారు. 8:30 గంటలకు రోడ్డు మార్గంలో ఎర్రబెల్లి నుండి బయలు దేరి.. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. అనంత‌రం మధ్యాహ్నం సూర్యాపేటలో కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. సాగు నీరు లేక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిన పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఈ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. కరువు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేసీఆర్ భరోసా ఇవ్వ‌నున్నారు. దేవరుప్పల మీదుగా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట, నకిరేకల్, తిప్పర్తి, మాడుగులపల్లి, నిడమానూరు మండలాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. సాయంత్రం నల్గొండ, చిట్యాల భువనగిరి మీదుగా ఎర్రబెల్లి పామ్ హౌస్ కి రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం అవ‌నున్నారు.

Updated On 30 March 2024 9:39 PM GMT
Yagnik

Yagnik

Next Story