ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌కు(BRS) 105 సీట్లు గ్యారంటీగా వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) కొండంత ధీమాతో చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేసీఆర్‌(KCR) ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌కు(BRS) 105 సీట్లు గ్యారంటీగా వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) కొండంత ధీమాతో చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేసీఆర్‌(KCR) ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ పదేళ్ల కాంలో ప్రజలకు మనం చేసింది చెప్పుకుంటే చాలని, గెలుపు మనదే అవుతుందని కేసీఆర్‌ అన్నారు.

'రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్‌ పెట్టండి. వాళ్లతో కలిసి భోజనాలు చేయండి. అది సరిపోతుంది' అని తెలిపారు. ఈ ఏడాది చివరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవడం పక్కా అని పేర్కొన్నారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్‌(Congress) పార్టీ చేసిందేమీ లేదని, అందుకే వాళ్లను జనం నమ్మరని కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2వ తేదీ నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం పైనా చర్చించారు. మంత్రులు ఆయా జిల్లాలలో ఉత్సవాలు పర్యవేక్షించాలని ఆదేశించారాయన.

Updated On 17 May 2023 7:14 AM GMT
Ehatv

Ehatv

Next Story