కరీంనగర్‌లో(Karimnagar) 2020లో ఓ మైనర్‌ బాలికపై(minor) అత్యాచారానికి(Rape) పాల్పడ్డ ఇద్దరు యువకులకు జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష(Life imprisonment) వేసింది.

కరీంనగర్‌లో(Karimnagar) 2020లో ఓ మైనర్‌ బాలికపై(minor) అత్యాచారానికి(Rape) పాల్పడ్డ ఇద్దరు యువకులకు జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష(Life imprisonment) వేసింది. 2020 ఫిబ్రవరి 24న ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మూడో తరగతి చదువుతున్న 9 ఏళ్ల మైనర్ బాలికను కరీంనగర్‌లోని అంబేద్కర్‌ నగర్‌కు చెందిన ఇటిక్యాల వినోష్‌ అత్యాచారం చేశాడు. తన గదికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికకు జ్వరం రావడంతో ఆమెను ఇంటి వద్దే వదిలి తల్లిదండ్రులు పనికి వెళ్లారు. మరుసటి రోజు అంటే 25న వినోష్ బాలికను మళ్లీ తన రూంకు తీసుకెళ్లగా అతనితో పాటు మన్నెం రవి, తేజలు బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని బాలికను ప్రశ్నించగా జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించడంతో బాలిక తల్లి కరీంనగర్‌ మూడో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షులను కోర్టులో హాజరుపర్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి వెంకటేష్ ఇద్దరు నిందితులకు జీవితఖైదు విధించారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున జరిమానా విధించారు. అయితే ఈ కేసులో మరో మైనర్‌ బాలుడు ఉన్నందున అతడిపై జువైనల్ కోర్టులో కేసు విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story