తెలంగాణలో రేవంత్‌రెడ్డి(Revanth reddy) పాలన దరిద్రంగా ఉందన్నారు కేఏ పాల్‌(KA Paul).

తెలంగాణలో రేవంత్‌రెడ్డి(Revanth reddy) పాలన దరిద్రంగా ఉందన్నారు కేఏ పాల్‌(KA Paul). చేతకాని దద్దమ్మలా పాలన చేస్తున్నారని, పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని పాల్‌ డిమాండ్‌ చేశారు. కొండా సురేఖ(Konda surekha), దానం నాగేందర్‌(Dhanam nagendra), మేయర్ విజయలక్ష్మి రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్నారు. చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు(Amit shah) ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు. తనను చంపాలని చూసిన వారు చనిపోయారే తప్ప, ఏమీ చేయలేకపోయారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంత అవినీతి ప్రాజెక్టు లేదని చెప్పిన రేవంత్ రెడ్డి సీబీఐకి ఎందుకు అప్పగించలేదని, పది నెలలలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు మంచోళ్ళు కాదు కానీ లక్షల కోట్లు దోచుకున్న వారు రేవంత్ కి మంచివారిలా కనిపిస్తున్నారని పాల్‌ అన్నారు. తనను చంపితే స్వర్గానికి వెళతానని, మంచి చేసేందుకు తాను ఎప్పుడూ సిద్దమేనని అన్నారు. హైడ్రా డ్రామా ల తయారైందని, నాగార్జున కు ఒక న్యాయం, రేవంత్ రెడ్డి తమ్ముడికి ఒక న్యాయమా? అని నిలదీశారు కేఏ పాల్‌.

Eha Tv

Eha Tv

Next Story