గురుకుల స్కూల్లో మల్లన్న గుడి కడితేనే శాంతిస్తా

జగిత్యాల(Jagityal) జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో(Gurukul school) 9వ తరగతి చదువుతున్న కౌశిక్(Koushik) అనే విద్యార్థి తల్లి కృష్ణవేణి కి పూనకం వచ్చి కింద పడిపోయింది. గురుకులంలో మల్లన్న గుడి నిర్మిస్తే శాంతిస్తా. ఆలయం నిర్మించ కపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమౌతాయంటూ ఓ విద్యార్థి తల్లి ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయి కేకలు వేస్తూ పూనకం వచ్చినట్లు ఊగిపోయి పొర్లు దండాలు పెట్టింది. నాది నాగదేవత రూపం, ఇక్కడ

ఆలయం నిర్మించి నిత్యపూజలు చేయకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయంటూ ఆ మహిళ అంటున్న మాటల వీడియో వైరల్‌గా మారింది. గడిచిన 20 రోజులలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందినట్లు అనుమానిస్తుండగా పరిసరాల్లో కుప్పలు తెప్పలుగా పాములు పుట్టలుండగా పాముల బయట పడడం మరింత అనుమానాలకు బలం చేకూర్చు తున్నట్లు అవుతుంది. దీనికి తోడు పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు వచ్చిన ఓ మహిళకు పూనకం వచ్చి తనను ఎవరూ పట్టించుకోవట్లేదని, గురుకులంలో మల్లన్న గుడినిర్మించి నిత్యపూజలు చేస్తే శాంతిస్తానంటూ ఓ విద్యార్థి తల్లి కృష్ణవేణి అనే మహిళ గురుకులంలో కేకలు వేస్తూ పూనకం వచ్చినట్లు ఊగిపోయి పొర్లు దండాలు పెట్టడం కలకలం సృష్టిస్తోంది




Eha Tv

Eha Tv

Next Story