నాంపల్లి(Nampally)లోని బీజేపీ(BJP) కార్యాలయాన్ని తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు ముట్టడించారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలిగించాలని ఎంపీ సోయం బాబు రావు వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు బీజేపీ కార్యాలయ ముట్ట‌డికి య‌త్నించారు. జేఏసీ నాయకులు కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నిం చేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై జేఏసీ నాయకులను అడ్డుకున్నారు.

నాంపల్లి(Nampally)లోని బీజేపీ(BJP) కార్యాలయాన్ని తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు ముట్టడించారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలిగించాలని ఎంపీ సోయం బాబు రావు( MP Soyam Babu Rao) వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు బీజేపీ కార్యాలయ ముట్ట‌డికి య‌త్నించారు. జేఏసీ నాయకులు కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నిం చేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై జేఏసీ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలోనే పోలీసులకు, జేఏసీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సోయం బాబూరావు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి, బీజేపీ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

Updated On 6 Aug 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story