వేసవి సెలవుల్లో షిరిడి ప్రయాణం చేయాలి అనుకునే వారికి శుభవార్త చెప్పింది. కేవలం 3500 రూ ల ప్యాకేజీ తో షిరిడి ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది . ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుండి షిరిడి వెళ్లే వారికీ అందుబాటులోకి తెచ్చింది .

వేసవి సెలవుల్లో షిరిడి ప్రయాణం చేయాలి అనుకునే వారికి శుభవార్త చెప్పింది. కేవలం 3500 రూ ల ప్యాకేజీ తో షిరిడి ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది . ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుండి షిరిడి వెళ్లే వారికీ అందుబాటులోకి తెచ్చింది . సాయి సన్నిధి పేరుతో ట్రైన్ టూర్ పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజీ లో ప్రయాణికులు 2 రాత్రులు, 3 రోజుల పాటు షిరిడి యాత్రను పూర్తి చేయచ్చు. సాయిబాబా భక్తులు గురువారం రోజు షిరిడీ ఆలయాన్ని దర్శించుకునివిధం గా ఈ టూర్ ప్రతి బుధవారం మొదలుఅవుతుంది .

సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ట్రైన్ జర్నీ ప్రారంభం అవుతుంది. బుధవారం సాయంత్రం 6. గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్ రైలు లో మీ ప్రయాణం మొదలవుతుంది . మరుసటి రోజు ఉదయం నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాక అక్కడినుండి ప్రయాణికుల్ని షిరిడి చేరుస్తారు . భక్తులు సొంత ఖర్చులతో షిరిడీలో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవాలి.
బాబా దర్శనం పూర్తైన తర్వాత సాయంత్రం 4 గంటలకు శనిశిగ్నాపూర్ బయల్దేరాలి. అక్కడి శని ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత నాగర్సోల్ బయల్దేరాలి. రాత్రి 9.20 గంటలకు నాగర్సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఇలా మూడు రోజుల్లో షిరిడి వెళ్లి వచ్చేయచ్చు చాల సులభంగా . ఈ ప్యాకేజీ లో శనిసింగణాపూర్ కూడా దర్శించుకొని అవకాశం కలిపిస్తుంది IRCTC . అలాగే ఈ ప్యాకేజీ ధర ఒక మనిషికి కేవలం రూ.5,390 చెల్లించాల్సి ఉంటుంది . అదే ఇద్దరు లేదా ముగ్గురుగా వెళ్లేవారికి ఇంకా తక్కువ ధరల్లోని ప్యాకేజీ అందుబాటులో ఉంది . ముగ్గురు ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.3,170,అదే ఇద్దరు ప్రయాణిస్తే
ఒకరికి రూ.3,700 చెల్లించాలి. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

తెలంగాణ టూరిజం షిరిడీ సాయి భక్తుల కోసం మరిన్ని టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది . ఈ ప్యాకేజీలో షిరిడీ సాయిబాబా దర్శనంతో పాటు నాసిక్, త్రయంబకేశ్వర్ కూడా కవర్ అవుతాయిఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,100. కేవలం షిరిడీ సాయిబాబా దర్శనం చేసుకోవాలనుకునేవారికి రూ.2400 ధరకే మరో ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

Updated On 14 March 2023 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story